వ్యవస్థలు

 
     
 
  మనబడి
 

తెలుగు తల్లికి చక్కని తెలుగు పదాల చిక్కని అక్షరమాలలు సమర్పిస్తున్న చిన్నారులు..తాము ఆస్వాదించిన తెలుగు పరిమళాలనే తమ పిల్లలూ గ్రోలుతున్నారన్న పెద్దల సంతృప్తి...చిన్నారులు తాము తెలుగు వారమని సగర్వంగా నినదిస్తూ జండాలు చేతబూని శోభాయత్ర జరుపుతున్న సుందర దృశ్యం.. ప్రతీ వారం పిల్లలందరూ పోటీపడి తెలుగులోనే మాట్లాడుతూ, ఆడుతూ, పాడుతూ కేరింతలు వేయడం..                                                             క్లిక్ చేయండి>>

   

       
 

కూచిపూడి

కూచిపూడి నృత్య వారసత్వాన్ని ముందు తరాలకు మరింత శోభాయమానమైన కాంతులీనేలా అందజేయడానికి విశ్వవేదిక ఏర్పాటు చేయడమే సిలికానాంధ్ర ఆశయం. అరుదైన ఈ సంపదను మన తరువాతి తరాలకు బంగారు పళ్ళెంలో అందిస్తూ ఈ నృత్యరీతి యొక్క ప్రాముఖ్యతను వారు సరిగా గుర్తించేలా చేయడమే ఈ సమ్మేళనానికి లక్ష్యం..                                                       క్లిక్ చేయండి>>

 
       
 

సుజనరంజని

ప్రపంచం నలుమూలలా నున్న తెలుగువారికి సాహితీ సౌరభాలను అందించడానికి ఎన్నో ప్రయత్నాలు జరగాలి. ప్రపంచ వ్యాప్తమైన తెలుగు సాహితీ దీప్తిని సమున్నతంగా ప్రకాశింపజేయడమే లక్ష్యంగా సాహితీ సంస్కృతుల పరిరక్షణా బాధ్యతను భుజానికెత్తుకున్న సిలికానాంధ్ర చేస్తున్న చిరు ప్రయత్నమే సుజనరంజని.
              
                                                                           క్లిక్ చేయండి>>

 
       
 
 

అంతర్జాలంలో తెలుగు

తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించిన సందర్భంగా..మన భాష ప్రాచీన భాషే కాదు..ప్రపంచ భాషగా మారాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి యూనికోడ్ కన్సార్టయం లో సభ్యత్వం తీసుకోవడమే కాక, కాలిఫోర్నియాలో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు నిర్వహించింది సిలికానాంధ్ర.
              
                                                                           క్లిక్ చేయండి>>

 
       
 

అన్నమాచార్య జయంత్యుత్సవాలు

ఏనోట చూసినా గోవిందనామ సంకీర్తనం... ఎటువైపు చూసినా అన్నమయ్య పదాలు నిండిన బ్యానర్లు... పదునాలుగు గంటల పాటు వందలాది కళాకారులచే అప్రతిహతంగా అన్నమయ్య పదాలతో సుస్వరార్చన....

              
                                                                           క్లిక్ చేయండి>>

 
       
 

అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం

ఏ కార్యక్రమానికైనా నాంది పలికే నాదస్వరం నేడు వినరావడం లేదు. వివాహాది శుభకార్యాలకు పరిమితమైపోయింది. కళకు ఆదరణ నానాటికీ అడుగంటు తున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న నాదస్వరం, డోలు, క్లారినెట్, సాక్సాఫోన్ విద్వాంసులను ఒక వేదికపైకి తెచ్చి భవిష్యత్తులో ఈ కళ ఉజ్వలంగా కొనసాగేలా చేయాలని సిలికానాంధ్ర హైదరాబాద్‌లో అంతర్జాతీయ మంగళ వాద్య సమ్మేళనాన్ని నిర్వహించింది.
              
                                                                           క్లిక్ చేయండి>>